Type Here to Get Search Results !

Telugu Educational News 11th Oct 2022

ప్రభుత్వ బడుల్లో తగ్గిన విద్యార్థులు 3.98 లక్షలు

పిల్లలు పుట్టడం తగ్గి.. ప్రవేశాలు కొంత తగ్గాయి..
పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాదితో పోల్చితే 3.98 లక్షలమంది విద్యార్థులు తగ్గినట్లు ప్రభుత్వమే అంగీకరించింది. కరోనా సమయంలో ప్రైవేటు ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావడం వల్ల దేశవ్యాప్తంగా సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. వచ్చిన వారిలో కొంతమంది వెనక్కి వెళ్లిపోయారని తెలిపింది. రాష్ట్రంలో జననాల రేటు తక్కువగా ఉన్నందున ప్రవేశాలు తగ్గుతున్నాయని కూడా చెప్పడం విశేషం. సోమవారం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ విలేకర్ల సమావేశంలో విద్యార్థులకు సంబంధించి ఈ వివరాలు వెల్లడించారు. కరోనా సమయంలో ప్రభుత్వ బడుల్లో చేరినవారిలో అందరూ వెళ్లిపోలేదని, ఇంకా 2.12 లక్షల మంది పిల్లలు ఉన్నారన్నారు. రాష్ట్రంలో జననాల రేటు తక్కువగా ఉన్నందున ప్రవేశాలు తగ్గుతున్నాయని చెప్పారు. కర్నూలులో ఒక ఐఏఎస్ అధికారి, శాప్ ఎండీ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారని తెలిపారు. పదోతరగతి పరీక్షల్లో ఆంగ్ల మాధ్యమంలో 77.55%, తెలుగు మాధ్య మంలో 43.97% మంది ఉత్తీర్ణులయ్యారని, ఆంగ్లంలో చదివిన వారే ఎక్కువ ఉత్తీర్ణులవుతున్నారని ఆయన చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు కేంద్ర ప్రభుత్వ యూడైస్ ప్లస్ డేటానే ప్రామాణికమని రాజశేఖర్ తెలిపారు. విద్యార్థుల వివరాల నమోదు సెప్టెంబరు 30తో ముగిసినందున యూడైస్ పూర్తి కాక.. సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గతేడాది విద్యార్థుల సంఖ్యనే ఇచ్చా మన్నారు. వలసల కారణంగా 16,857 మంది, సీజనల్ వలసల వల్ల 38,951 మంది బడి మానేశారని.. 1,289 మంది చనిపోయారని తెలిపారు. సీజనల్ వలసల్లో 12,000 మందిని తిరిగి బడుల్లో చేర్పించామన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా సత్ఫలితాలు రావని పేర్కొన్న ఆయన ప్రభుత్వ విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీ పడేలా తయారు చేస్తున్నామని వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు సైతం బ్రహ్మాండంగా ఆంగ్లంలో మాట్లాడుతున్నారని, బెండపూడి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు ఒక కొత్త విధానంలో భాష నేర్పుతున్నారని చెప్పారు. ఆస్ట్రేలియాలోని ఆంగ్ల టీచర్ సైతం బెండపూడికి వచ్చి అభినందించారని రాజశేఖర్ వెల్లడించారు.

విద్యపై విషపు రాతలా?

  • విద్యారంగం వెనుకబాటు అంటూ 'ఈనాడు' దుష్ప్రచారం
  • ప్రభుత్వంపై విషం కక్కుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనం
  • ఈ రాతల వెనుక క్రిమినల్ ఆలోచనలు
  • ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ ధ్వజం
 'వెనుక'బడి'నా గొప్పలే' అంటూ ఈనాడు దినపత్రిక సోమవారం వండివార్చిన కథనంలో అన్నీ అసత్యాలేనని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న దుర్బుద్ధితో తప్పుడు కథనాన్ని ప్రచురించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్య) బి. రాజశేఖర్‌ తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ కథనాన్ని రాసిందని, ఇందులో దురుద్దేశమే కాకుండా నేరపూరిత ఆలోచనలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు రాసిన కథనంలోని ప్రతి అంశమూ అసత్యమేనని సవివరంగా స్పష్టంచేశారు. అంశాల వారీగా ఈనాడు తప్పుడు రాతలను రాజశేఖర్‌ ఎండగట్టారు.


ఉపాధ్యాయుల పదోన్నతులపై గందరగోళం

జిల్లాపరిషత్తు, ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది.

రాష్ట్ర విద్యాశాఖ పదోన్నతుల షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. ఆ ప్రకారం 10వ తేదీన సీనియార్టీ తుదిజాబితా విడుదల చేయాలి. ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు 11వ తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. సీనియార్టీ జాబితా సోమవారం రాత్రి 9 గంటలకు కూడా వెల్లడించలేదు. జాబితా తయారీలో జిల్లా విద్యాశాఖ అధికారులు రాత్రి వరకు కసరత్తు చేస్తూనే ఉన్నారు. జాబితాను రాష్ట్ర విద్యాశాఖకు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. 11వ తేదీన ప్రధానోపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ జరగాలి. వాటి వివరాలు కూడా అర్హులకు అందలేదు. రాష్ట్రవిద్యాశాఖకు జాబితా పంపిస్తామని, అక్కడి నుంచి ఉపాధ్యాయులకు నేరుగా సమాచారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్‌ లేకుండానే నేరుగా పదోన్నతులు కల్పిస్తారని కొందరు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. 42 మందికి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 54 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. వారిలో 31 మంది సమ్మతి పత్రాలు సమర్పించారు. మిగిలిన వారు పదోన్నతులు వద్దని రాతపూర్వకంగా ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు అర్హులైన వారు, తమ చరవాణికి వచ్చే ఓటీపీ ద్వారా సమ్మతి తెలియజేయాల్సి ఉంటుంది.

'సెట్' అడ్మిషన్లన్నీ ఈ నెలలోనే

17 నుంచి ఏపీ ఈఏపీ సెట్ రెండో విడత కౌన్సెలింగ్
ఈ నెల 13 వరకు ఈసెట్, 25 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
పీజీ ఈసెట్ అడ్మిషన్లు 27 నుంచి ఆరంభం..
ఉన్నత విద్య కోర్సులకు ప్రవేశాలన్నీ ఆన్‌లైన్‌లోనే..
డిగ్రీ కోర్సులన్నీ నాలుగేళ్లు..
ఇంటర్న్‌షిప్, అలాగే ఉచితంగా కంప్యూటర్‌ సర్టిఫికెట్‌ కోర్సులు
ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి వెల్లడి

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఈఏపీ సెట్‌-2022 రెండో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి ప్రకటించారు. ఈనెల 25వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వివిధ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ తేదీలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం ఆయన విడుదల చేశారు.

ఈసెట్, ఐసెట్, పీజీఈ సెట్, జీప్యాట్, బీఆర్క్‌లకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌ తేదీలను ఖరారు చేసినట్లు వివరించారు. అలాగే పీఈ సెట్, పీజీ సెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లను త్వరలో చేపట్టనున్నట్టు చెప్పారు. ఆర్‌ సెట్‌ పరీక్ష నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేశామన్నారు. ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి కేటగిరీ-బి (యాజమాన్య కోటా) సీట్లలో ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి సెప్టెంబర్‌ 3నుంచి 15వరకు అవకాశం ఇచ్చామన్నారు.

నాన్‌ ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను సెప్టెంబర్‌ 27 నుంచి ప్రారంభించామని, అక్టోబర్‌ 17వ తేదీతో ఈ అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. కొన్ని సెట్ల తొలివిడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ముగియగా.. కొన్ని సెట్ల తొలివిడత ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వాటినీ పూర్తిచేసి రెండో విడత కౌన్సెలింగ్‌ను చేపట్టేందుకు వీలుగా షెడ్యూళ్లను ఖరారు చేశామని వివరించారు.

డిగ్రీ కోర్సుల సీట్ల కేటాయింపు
కాగా, రాష్ట్రంలోని ఉన్నత విద్యాకోర్సులన్నిటికీ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లోనే కల్పిస్తున్నామని హేమచంద్రారెడ్డి వివరించారు. జూలై 22న డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ ఇచ్చామని, సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 10 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించామని చెప్పారు. ఈ నెల 14న డిగ్రీ అభ్యర్థులకు తొలివిడత సీట్ల కేటాయింపు చేస్తామని చెప్పారు. వారంతా 15వ తేదీన కాలేజీల్లో రిపోర్టు చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.

డిగ్రీ కోర్సులన్నీ నాలుగేళ్ల హానర్‌ కోర్సులుగా చేశామని, డిగ్రీలో చేరిన విద్యార్థులు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మూడేళ్లకే ఎగ్జిట్‌ అయ్యే విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్‌ ఉంటుందన్నారు. ఇప్పటికే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు.

ఇంటర్న్‌షిప్‌తోపాటు అదనంగా మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్‌ వంటి వివిధ ఆధునిక కంప్యూటర్‌ సర్టిఫికెట్‌ కోర్సులను కూడా ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.రామమోహనరావు, కార్యదర్శి ప్రొఫెసర్‌ నజీర్‌ అహమ్మద్, సెట్స్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

లక్ష మంది విద్యార్థులకు డిజిటల్ శిక్షణ

'మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్' సహకారంతో ప్రారంభించిన ధోని

బెంగళూరు (క్రీడలు), న్యూస్టుడే: బెంగళూరు నగరంలోని ఎం.ఎస్. ధోని గ్లోబల్ పాఠశాలలో వెయ్యి మంది ఉపాధ్యాయులు, లక్ష మంది విద్యా ర్థులకు సాంకేతికత డిజిటల్ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని జాతీయ క్రికెట్ జట్టు మాజీ సారథి ఎం. ఎస్. ధోని సోమవారం ప్రారంభించారు. ఇక్కడి కూడ్లు గేట్ సమీపంలోని గ్లోబల్ పాఠశాలను సందర్శించిన ఆయన.. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. వచ్చే ఏడాదిలోగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన వెయ్యి మంది ఉపాధ్యాయులు, లక్ష మంది విద్యార్థు లకు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నట్లు పేర్కొన్నారు. 'మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్' సంస్థ సహకారంతో ఈ శిక్షణ కొనసాగిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ భువ నేశ్వరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్

ఆరు సంవత్సరాల సమీకృత ఇంజనీరింగ్ విద్యాబోధనకు నిలయమైన ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 12వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల కోసం ఈ నెల 12, 13 తేదీల్లో ఆయా క్యాంపస్లలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ప్రవే శాలకు 14, 15 తేదీల్లో ఇడుపులపాయలో, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల కోసం 15, 16 తేదీల్లో ఎచ్చెర్ల క్యాంపస్లో కౌన్సె లింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యార్థులకు ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికా రులు కాల్ లెటర్లతోపాటు వారి సెల్ఫోన్ లకు మెసేజ్లు కూడా పంపారు. కౌన్సెలిం గ్కు ట్రిపుల్ ఐటీల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.

మధ్యాహ్న భోజనం ఖర్చును పెంచిన కేంద్రం

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను పెంచింది. రెండేళ్ల విరామం అనంతరం ఒక్కో విద్యా ర్థిపై గతంలో అందిస్తున్న వంట ఖర్చు(ఆహార దినుసులు, గ్యాస్ తదితరాలు కలిపి)ను 9.6శాతం మేర పెంచింది. 2020లో చివరిసారి వంట ఖర్చును పెంచిన సమయంలో ప్రాథమిక తరగతి (1-4వ తరగతి వరకు) లో ఒక్కో చిన్నా రికి భోజనానికి రోజుకు రూ.4.97 చెల్లించగా, దానిని ఇప్పుడు రూ.5.45 కు సవరించింది. ప్రాథమికోన్నత (6- 8వ తరగతి వరకు) స్థాయిలో భోజనం ఖర్చు రూ.7.45 నుంచి రూ.8.17కు పెంచుతూ కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 11.20 లక్షల ప్రభుత్వం, ప్రభుత్వ ఎయి డెడ్ పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పెంచిన ధరలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసిం ది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో నిధులు సమకూరుస్తాయి. 2022-23 బడ్జెట్లో కేంద్రం ఈ పథకానికి రూ.10,233 కోట్లు కేటా యించగా, రాష్ట్రాలు రూ.6,277 కోట్లు ఖర్చు చేయనున్నాయి. కేంద్రంపై అదనంగా రూ. 600 కోట్ల భారం పడనుందని సమాచారం.

సిఆర్టీ లకు షాక్! పది నెలలే వేతనం

ఈ విద్యా సంవత్సరం నుంచి తిరిగి అమలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాకుగానిర్ణయం

రాష్ట్ర ఖజానా పరిస్థితి సరిగా లేదనే పేరుతో ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ఆలోచనల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సిఆర్టీ)లకు వేతనాల చెల్లింపు నెలలను కుదించింది. ఏడాది మొత్తానికి అంటే 12 మాసాలకు కాకుండా కేవలం పది నెలలకు మాత్రమే చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు వారం రోజుల క్రితం గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది. దీంతో, సిఆర్డిలకు ఈ విద్యా సంవత్సరం నుంచి పది నెలలకు మాత్రమే. వేతనాలు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇవి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇవి ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల గతంలో వీటిని అక్కడ ఏర్పాటు చేశారు. 

మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు వీటిల్లో ఆశ్రమం పొందుతూ విద్యను అభ్యసిస్తుంటారు. వీటిల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు సిఆర్డిలు కూడా విధులు నిర్వహిస్తుంటారు. దాదాపు వెయ్యి మంది వరకు సిఆర్డిలు ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్నారు. వీరికి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులకు మాదిరిగా సిఆర్డిలకు ప్రభుత్వం ఏడాదిలో పది నెలలు మాత్రమే జీతాలు చెల్లించేది. 12 నెలలూ వేతనాలు చెల్లించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కోవిడ్ సమయంలో ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు మాదిరిగానే సిఆర్డిలకు కూడా ఏడాది పొడవున అంటే 12 నెలలూ వేతనాలు చెల్లించింది.గత రెండు విద్యా సంవత్సరాల్లో ఇది అమలు చేసింది. అయితే, ఈ విద్యా సంవత్సరం నుంచి పది నెలలకే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, సిఆర్డిలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో జరగనున్న టీచర్స్, గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారిలో చర్చ జరుగుతోంది. పిఆర్సి, సిపిఎస్ రద్దు వంటి అంశాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యతిరేకతను ప్రభుత్వం ఇప్పటికే మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిఆర్డిల అంశం కూడా కీలకం కానుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ సత్తా చాటేందుకు వారు సంసిద్ధం అవుతున్నట్లు సమాచారం.

కొత్త పిఆర్సిలో కోతలు వద్దు

ఆర్టీసి ఉద్యోగ సంఘాల జెఎసి

ఆర్టిసి ఉద్యోగులకు కొత్త పిఆర్సిలో అలవెన్సులను, ఓటీలను కోత పెట్టకుండా పూర్తి స్థాయిలో కొనసాగించాలని ఆర్టిసి ఉద్యోగ సంఘాల జెఎసి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టిసి ఎమి ద్వారకా తిరుమలరావును జెఎసి కన్వీనర్లు పలిశెట్టి దామోదరరావు, వై శ్రీనివాసరావు, కో కన్వీనర్లు సిహెచ్ సుందరయ్య, వైఎస్ రావు కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆర్ టిసిలో డ్రైవర్లకు, కండక్టర్లకు, గ్యారేజ్ సిబ్బందికి చాలా కాలంగా అలవెన్స్లు, ఓటీలు ఇస్తున్నారని, ఇప్పుడు కోతలు పెట్టడం సరికాదన్నారు. మెడికల్ లీవ్ లో ఉన్న ఉద్యోగులకు కూడా కోత విధించారని వివరించారు. ఆర్టిసి ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఈ నెలలో కోత విధించిన అలవెన్స్లను, ఓటీలను తక్షణం వేతనంలో కలపాలని కోరారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రావు, ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

త్వరలో 1998 అభ్యర్థుల నియామకాలు

టెట్ డైరెక్టర్ మేరీ చంద్రిక
రాష్ట్ర ప్రభుత్వం 1998 అభ్యర్థుల నియామకాలు త్వరలో చేపడుతుందని టెట్ డైరెక్టర్ మేరీ చంద్రిక అన్నారు. సోమవారం డీఈవో కార్యాలయంలో 1998 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజుకు 100 మంది అభ్య ర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారన్నారు. సోమవారం డీఈవో కార్యా లయ సమావేశపు హాలులో అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆమె పరిశీలించారు. రుక్మిణిబాయి అనే అభ్యర్థిని టైమ్ స్కేలు పనిచేస్తానని విల్లింగ్ ఇవ్వక పోవడంతో ఆమె పేరు ఎంపికైన అభ్యర్థుల జాబితాలో లేకపోవడంతో నిరాకరించారు. విజయవాడకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఎన్. వెంకటేశ్వర రావు ఉద్యోగం ఇప్పించాలంటూ దరఖాస్తు పట్టుకుని తన కుమారుని సాయంతో డీఈవో కార్యాలయానికి వచ్చారు. 1960 జూన్ 1వ తేదీ పుట్టిన తేదీగా ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వెంకటేశ్వరరావు | దరఖాస్తును తిరస్కరించారు. ఏడీ అజీజ్, ప్రధానోపాధ్యాయులు వైవీ హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా తయారీకి వలంటీర్లు దూరం

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాల



పెన్షన్ రద్దుకు కొత్త సాకు - నిర్లక్ష్యం పేరిట నిలిపివేత

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్


Tags