Type Here to Get Search Results !

Telugu Educational Employees News 20th Oct 2022

5జితో డిజిటల్ విద్య - తరగతి గదిలో విద్యార్థులతో మోడీ

కొత్త శిఖరాలకు చేరిన బోధనా విధానం
గుజరాత్లో ఎక్స్టెన్స్ స్కూళ్లకు శ్రీకారం
పాఠ్యాంశాలు విన్న ప్రధాని
మౌలిక వసతులకు హామీ
రూ. 10వేల కోట్లతో ప్రణాళిక రూపకల్పన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాం ధీనగర్లోని మిషన్ స్కూల్కు వెళ్లారు. కొద్దిసేపు విద్యా ద్దిగా మారారు. తరగతి గదిలో విద్యార్ధులతో ఆసి బెంచ్ పై కూర్చుతున్నారు. ఒక విద్యార్థి పాఠ్యాంశాన్ని భోధిస్తుంటే శ్రద్ధగా విన్నారు. డిజిటల్ అనుభవాలపై తనపక్కన కూర్చున్న విద్యార్థినిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో సరదాగా సంభాషిం చారు. టెక్నాలజీ ద్వారా విద్యార్థులు ఎలా నేర్పుకుంటున్నారో ప్రత్యక్షంగా గమనించారు. ఈ ఆసక్తికరమైన" సన్నివేశం బుధవారం గాంధీనగర్ లో వినిపించింది. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని, మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించిన ప్రధాన తరగతి. గదిలో తానూ విద్యార్థిగా మారారు. 5జ్ కెక్నాలజీ దేశ విద్యా వ్యవస్థను తదుపరి దశకు తీసుకెళ్తుందని అన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి సహాయపడే అత్యాధునిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్దాలలో దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయులను నియమించామని, 1.5 లక్షల తరగతి గదులు నిర్మించామని మోడీ చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు గ్రామాలకు వెళ్లి పిల్లల్ని చేయిపట్టుకుని స్కూళ్లకు తీసుకెళ్లి మెరుగు పరిచామని గుర్తు చేశారు.రూ.10వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ మిషన్ స్కూల్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందించింది. ప్రాజెక్టులో భాగంగా కొత్త తరగతి గదులు, స్మార్ట్ క్లాస్ రూమ్ లు, కంప్యూటర్ ల్యాగ్లు, మౌలిక సదుపాయాల అప్ గ్రేడేషన్ వంటి పనులు చేస్తారు. ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా, రూ.5587 కోట్లతో మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తారు. 1.5 లక్షల ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తారు. 20 వేల కంప్యూటర్ బ్యాబ్ లు, ఏడేల అటల్ టింకరింగ్ ల్యాబ్ లతోపాటు 50 వేట తరగతి గదులను కొత్తగా నిర్మిస్తారు.

ఆర్టీసీ ఆన్లైన్ రిజర్వేషన్లు నాన్ ఏసీ సర్వీసుల్లో కూడా 10 శాతం రాయితీ 

రేపటి నుంచి అమలు  -ఆరు నెలలు వర్తింపు
ఆన్లైన్ పాసింజర్ రిజర్వేషన్ విధానం ( ఓపీఆర్ఎస్ ) లో ఆర్టీసీ పోర్టల్ , యాప్ ద్వారా తిరుగు ప్రయాణం ( రిటర్న్ జర్నీ ) టిక్కెట్లు బుక్ చేసుకున్న ఏసీ బస్సు ప్రయాణికులతో పాటు నాన్ ఏసీ ప్రయాణికులకు కూడా 10 శాతం రాయితీ ఇవ్వనుంది . శుక్రవారం నుంచి అమలులోకి రానున్న ఈ రాయితీ వచ్చే ఏడాది ఏప్రిల్ 20 వ తేదీ వరకు అమలులో ఉంటుంది .

ఎమ్మెల్సీ ఎన్నికలపై  పనివేళల్లో ప్రచారం చేస్తే చర్యలు

ఎమ్మెల్సీ ఎన్నికలపై పాఠశాల విద్యాశాఖ సీరియస్‌
 పాఠశాలల పనివేళల్లో ఎన్నికల ప్రచారం చేయడంపై పాఠశాల విద్యాశాఖ సీరియస్‌ అయ్యింది. తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి బోధనా సమయంలో కొందరు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు రాజకీయ ప్రచారం చేస్తున్న విషయం పాఠశాల విద్యాశాఖ దృష్టికి వచ్చింది. ప్రచార కార్యక్రమాలు బోధనకు అంతరాయంగా మారుతున్నాయని తెలిపింది. నిబంధనలు పాటించేలా చూడాలని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల డీఈవోలకు ఆ శాఖ కమిషనర్‌ ఎస్‌.సురే్‌షకుమార్‌ బుధవారం ఆదేశాలు జారీచేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

నాడు నేడు పై నేతల పెత్తనం

చెప్పినట్టు వినాలని ఎచ్ ఏం ల పై ఒత్తిడి ఆందోళన చెందుతున్న ప్రధానోపాధ్యాయులు

మీరే తేల్చుకోండి -రెండో ఎంఈవో పోస్టుపై ప్రభుత్వం మడత పేచీ

నేడు టీచర్ల బదిలీలపై ఉత్తర్వులు
విద్యాశాఖలో కొత్త పోస్టులు ప్రతిపాదించిన ప్రభుత్వం.. వాటిపై వివాదం తలెత్తితే.. వాటిని పరిష్కరించే మార్గం చూడాల్సింది పోయి.. ‘మీరిలా కేసులు వేస్తే అసలుకే ఎసరు పెడతాం’ అని ఉపాధ్యాయులనే హెచ్చరించడం విద్యాశాఖలో చర్చకు దారితీసింది. మండలానికి రెండో విద్యాధికారి(ఎంఈవో) పోస్టు కావాలా? వద్దా? అనేది ఉపాధ్యాయులే తేల్చుకోవాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ప్రస్తుతం మండలానికి ఒక ఎంఈవో పోస్టు ఉండగా ఇటీవల ప్రభుత్వం రెండో పోస్టును ప్రతిపాదిస్తూ జీవో ఇచ్చింది. తద్వారా 679 కొత్త ఎంఈవో పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. దీనిపై ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయుల మధ్య కేటాయింపుల్లో గందరగోళం ఏర్పడింది. దీంతో కొత్తగా మంజూరు చేసిన పోస్టుల విషయంలో స్పష్టత లేదని కొందరు ఉపాధ్యాయులు హైకోర్టుకు వెళ్లారు. దానిపై వివరాలు సమర్పించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆ ప్రక్రియ నెమ్మదించింది. బుధవారం ఉపాధ్యాయ సంఘాలతో విజయవాడలో భేటీ అయిన మంత్రి బొత్స.. ఈ విషయాన్ని వారికే వదిలేశారు. రెండో పోస్టు కావాలంటే కోర్టులో పిటిషన్లు ఉపసంహరించుకోవాలని, లేదంటే కొత్తగా కేటాయించిన రెండో ఎంఈవో పోస్టులు రద్దు చేస్తామని తెలిపారు. ‘‘ఎవరో కోర్టుకు వెళ్తే అందరూ బాధ్యత తీసుకోలేరు కదా?’’ అని సంఘాల నేతలు చెప్పినా, అదంతా మీరే చూసుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. అలాగే మున్సిపల్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీడీవో అధికారాలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ బదిలీల ఉత్తర్వులు గురువారం విడుదల చేస్తామని, గరిష్ఠ సర్వీసు పరిమితిని ఎనిమిదేళ్లుగా నిర్ణయించామన్నారు. మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్‌ బోర్డును ప్రభుత్వంలో విలీనం చేయనున్నట్టు తెలిపారు

గెస్ట్‌ లెక్చరర్ల పారితోషికం పెంపు

డిగ్రీ కాలేజీల్లో బోధించే గెస్ట్‌ లెక్చరర్ల పారితోషికాన్ని పెంచుతూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గంటకు రూ.200గా ఉన్న పారితోషికాన్ని రూ.400 చేసింది. కాగా నెలకు గరిష్ఠ పారితోషికం రూ.28వేలు దాటకూడదని స్పష్టంచేసింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హర్షం వ్యక్తంచేశారు.

ప్రశాంతంగా ముగిసిన ఏపీఆర్‌సెట్‌

 ఆంధ్రప్రదేశ్‌ రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఆర్‌సెట్‌)-2022 ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 19 వరకూ 15 కేం ద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. 62 సబ్జక్టుల్లో ప్రవేశాలకు 7,590 మంది దరఖాస్తు చేసుకోగా.. 6,352 మంది (83.69 శాతం) హాజరయ్యారు. పరీక్ష నిర్వహించిన రోజే యూనివర్సిటీ అధికారులు ‘కీ’ విడుదల చేసి వెబ్‌సైట్‌లో పొందుపరచారు.

వైద్య కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలి

జాతీయ వైద్య మండలి

దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు అన్నింటిలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరును (ఏఈబీఏఎస్) తప్పని సరిగా అమలు చేయా లని జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) ఆదేశించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్ఎంసీ ప్రకారం.. వైద్య కళాశాలల్లోని సిబ్బంది, డ్మినిస్ట్రేటర్స్, ట్యూటర్లు, సీనియర్ రెసిడెంట్స్ తప్పనిసరిగా ఏఈబీ ఏఎస్ పరిధిలో ఉండాలి. ప్రతి వైద్య కళాశాలలో ఏఈబీఏఎస్ ఉండాలి. హాజరు నమోదుకు ఎటువంటి ఆటంకం లేకుండా వైవై/ ఫైబర్ ఇంటర్నెట్తో దానిని అనుసంధానించాలి. సరైన కారణం లేకుండా రెండు రోజుల పాటు బయోమెట్రి క్లో లో హాజరు నమోదు కాకపోతే ఎన్ఎంసీ దానిని తీవ్రంగా పరిగణిస్తుంది. వేలి ముద్రలు తీసుకునేలా యంత్రాలను గోడకు అమర్చాలి. వేలిముద్రల సమస్య ఉంటే ఐరిస్ ద్వారా హాజరు స్వీకరించే ఏర్పాట్లు చేయాలి. కళాశాలల్లోని సిబ్బంది అంతా ఉదయం, సాయంత్రం రోజుకు రెండు సార్లు హాజరు నమోదు చేయాలి.

10 విడతల్లో.. పిల్లల సంరక్షణ సెలవులు

 సర్కారు ఉద్యోగినులకు ప్రభుత్వం కల్పించిన 180 రోజులు పిల్లల సంరక్షణ సెలవులను మొత్తం సర్వీసులో పది విడతలలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఆస్కారం ఇచ్చింది. ఇందుకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో ఈ సెలవులు 60 రోజులుగా ఉండేది. 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ సెలవులను 180 రోజులకు పొడిగించారు. 2022 మార్చి నెలలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. గరిష్ఠంగా మూడు విడతల్లో మాత్రమే ఆ సెలవులు వినియోగించుకునేందుకు అవకాశం. ఉండేది. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం దీన్ని 10 విడతలకు పెంచాలని విన్నవించింది. వారి విన్నపం మేరకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు 60 రోజులు సెలవులు వినియోగించుకున్న ఉద్యోగినులు కూడా మిగిలిన సెలవు రోజులు వినియోగించుకోవచ్చు. విడతల విషయంలో కూడా వారు గతంలో వినియోగించుకున్న సంఖ్యను మినహాయించి మిగిలిన విడతల్లో ఆ సెలవులు వినియోగించుకునేందుకు ఆస్కారం కల్పించారు.

ఆర్జిత సెలవుల సొమ్ము ఎప్పుడు?

రూ.200 కోట్ల కోసం ఏడాదిగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదురుచూపులు
ఏడాది క్రితమే ఆర్టీసీ ఉద్యోగుల ఆర్జిత సెలవు లకు నగదు తీసుకోవడానికి (లీవ్ ఎన్ క్యాష్మెంట్) వీలుగా బిల్లులు అప్ లోడ్ చేసినా ఇప్పటికీ సొమ్ము విడుదల చేయలేదు. దీంతో ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఆర్టీసీ ఉద్యోగుల 2020-21 సంవత్సరం ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించ డంతో ఉద్యోగులు గత ఏడాది ఇందుకు సమ్మతి తెలిపారు. 40 వేల మంది ఉద్యోగులకు ఉన్న 15-20 సెలవులను నగదుగా మార్చుకోవడానికి అధికా రులు అంగీకారం తెలిపారు. ఆ మేరకు చెల్లించాల్సిన రూ.200కోట్లకు సంబంధించిన బిల్లును సీఎఫ్ఎంఎస్లో గత అక్టోబరులో అప్లోడ్ చేసినట్లు తెలిసింది. ఒక్కో ఉద్యోగికి వాళ్ల సెలవులు ఆధారంగా.. కనీసం సగం నెల జీతం చొప్పున, ఎక్కువ మందికి పూర్తి జీతం మేర చెల్లించాల్సి ఉంది.

విద్యాశాఖ ఉత్తర్వులపై ఉపాధ్యాయుల ఆందోళన

మున్సిపల్ ఉపాధ్యాయుల సెలవులు, ఇంక్రి మెంట్లు, మెడికల్ బిల్లులు మంజూరు చేసే అధికారాన్ని జిల్లా విద్యాశాఖాధికారికి కల్పిస్తూ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ నెల 17న జారీ చేసిన ఉత్తర్వుల పట్ల మున్సిపల్ ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నాయి. డీడీవో అధికారాలు ప్రధానోపాధ్యాయులకే ఇవ్వాలని గతంలో అనేక సార్లు ఉపాధ్యాయ సంఘాలు విన్నవించినప్పటికీ విద్యా శాఖ అధి కారులు తోసిపుచ్చి, ఇప్పుడు డీఈఓకి ఇవ్వడం తగదన్నారు. ఇటువంటి నిర్ణయాల కారణంగా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడతారని, వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చంద్రశేఖర్ డిమాండు చేశారు.

ఎన్ఎంఎంఎస్ కు దరఖాస్తులు

ఈ విద్యాసంవత్సరంలో (2022-23) 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష(ఎన్ఎంఎంఎస్)కు ఈ నెల 31 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జడ్పీ, నగరపాలక సంస్థ, ఎయిడెడ్, మండల పరిషత్తు పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. పరీక్ష ఫీజు ఓసి, బీసీ విద్యా ర్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 ఎస్ బీఐ ద్వారా చెల్లించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం www.bse.ap.gov.in వెబ్సైట్ లేదా జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

సబ్ రిజిస్ట్రార్ ల అధికారాలను తొలగించలేదు 

 పాలనా సౌలభ్యంకోసమే సచివాలయ కార్యదర్శులకు బాధ్యతలు
హై కోర్టు కు నివేదించిన ప్రభుత్వం 



Tags