నేటి నుంచి ఎడ్సెట్ కౌన్సిలింగ్
ఎడ్సెట్-2022 మొదటి దశ అడ్మిషన్ల కౌన్సిలింగ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్కు సంబంధించిన షెడ్యూల్ను ఎడ్సెట్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె రామ్మోహన్ రావు గురువారం విడుదల చేశారు. శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.ఈ నెల 22 నుంచి 27వ తేది వరకు వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఉంటుందని పేర్కొన్నారు.
26 నుంచి 31వ తేది వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు.
ప్రత్యేక విభాగం (వికలాంగులు, ఎన్సిసి, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్స్) అభ్యర్ధులకు విజయవాడలోని లయోల కళాశాలలో భౌతికంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నవంబర్ 1 నుంచి 3వ తేది వరకు ఉంటుందని,
3వ తేదీనే ఆప్షన్ల మార్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
5న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.
అభ్యర్ధులు నవంబర్ 7 నుంచి 9వ తేది వరకు సీట్లు పొందిన కళాశాలల్లో రిపోర్టు చేయాల్సివుంటుందన్నారు.
వివరాల కోసం ets.apsche.ap.gov.in వెబ్సైట్ సంప్రదించాలని సూచించారు.
భూ హక్కుల వివాదాలకు ముగింపు - మహాయజ్ఞంలా భూముల రీ-సర్వే
దేశానికి రోల్మోడల్గా రెవెన్యూ రికార్డులు
- రైతుల క్లియరెన్స్ పత్రాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా భూ యాజమాన్య హక్కుల వివాదాలన్నింటికీ ముగింపు పలికే దిశగా అడుగులు వేస్తున్నామని, నిషేధిత జాబితాలోని అనాధీన భూములు, చుక్కల భూములు, ఈనాం భూముల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో గురువారం నిర్వహించిన రైతుల క్లియరెన్స్ పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గన్నారు. నిషేధిత భూముల జాబితా 22 ఎ(1)(ఇ) నుంచి డి-నోటిఫై చేసి లబ్ధిదారులకు సిఎం జగన్ క్లియరెన్స్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇన్నాళ్లూ ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు వాటిపై సర్వహక్కులు లభిస్తాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 355 గ్రామాల్లో నిషేధిత జాబితాలోని 18,889 సర్వే నంబర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం చూపామన్నారు. 22,042 మంది రైతులకు వారి భూమి మీద హక్కును కల్పించామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా భూములకు సంబంధించి సరిహద్దులు, కచ్చితమైన రికార్డులు లేకపోవడంతో వివాదాలు ఏర్పడి భూ యజమానులు ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. వందేళ్ల తర్వాత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి భూముల రీ సర్వేను మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబరులో 1500 గ్రామాలు, 2023 చివరి నాటికి మిగిలిన 17 వేల పైచిలుకు గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి భూ యజమానులకు హక్కుపత్రాలు అందిస్తామన్నారు. దేశానికి రోల్మోడల్గా ఉండేలా రెవెన్యూ రికార్డులను అప్డేట్ చేస్తున్నామని చెప్పారు
- రైతుల క్లియరెన్స్ పత్రాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా భూ యాజమాన్య హక్కుల వివాదాలన్నింటికీ ముగింపు పలికే దిశగా అడుగులు వేస్తున్నామని, నిషేధిత జాబితాలోని అనాధీన భూములు, చుక్కల భూములు, ఈనాం భూముల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో గురువారం నిర్వహించిన రైతుల క్లియరెన్స్ పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గన్నారు. నిషేధిత భూముల జాబితా 22 ఎ(1)(ఇ) నుంచి డి-నోటిఫై చేసి లబ్ధిదారులకు సిఎం జగన్ క్లియరెన్స్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇన్నాళ్లూ ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు వాటిపై సర్వహక్కులు లభిస్తాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 355 గ్రామాల్లో నిషేధిత జాబితాలోని 18,889 సర్వే నంబర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం చూపామన్నారు. 22,042 మంది రైతులకు వారి భూమి మీద హక్కును కల్పించామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా భూములకు సంబంధించి సరిహద్దులు, కచ్చితమైన రికార్డులు లేకపోవడంతో వివాదాలు ఏర్పడి భూ యజమానులు ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. వందేళ్ల తర్వాత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి భూముల రీ సర్వేను మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబరులో 1500 గ్రామాలు, 2023 చివరి నాటికి మిగిలిన 17 వేల పైచిలుకు గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి భూ యజమానులకు హక్కుపత్రాలు అందిస్తామన్నారు. దేశానికి రోల్మోడల్గా ఉండేలా రెవెన్యూ రికార్డులను అప్డేట్ చేస్తున్నామని చెప్పారు
పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం చేయొద్దు
ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న తూర్పు, పశ్చిమ రాయలసీమ ప్రాంత జిల్లాల్లో అభ్య ర్థులు, వారి అనుచరులు పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల కార్యకలాపాల వల్ల విద్యార్థుల అభ్యసనకు ఆటంకాలు ఎదురవుతాయని, పాఠశాలల సమయాల్లో ప్రచారం నిర్వహించొద్దంటూ నాయకులు, ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వా లని డీఈవోలకు సూచించింది.జీపీఎస్ విధానాన్ని ఒప్పుకోం -ఆర్థిక ప్రయోజనాలు మంజూరు చేయాలి
ఏపీ ఎన్జీవో సంఘం నేతల డిమాండ్సమావేశమైన ఏపీ ఎన్జీవో సంఘం నేతలు
ఉద్యోగులపై కొందరు నాయకులు దాడులకు పాల్పడుతూ దురుసుగా ప్రవర్తిస్తున్నారు.. దీనిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీసీహెచ్ వెంగళ్రెడ్డి, జవహర్లాల్ అన్నారు. వారు గురువారం కలెక్టరేట్లో మాట్లాడారు. సీపీఎస్ రద్దుపై అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు.
జీపీఎస్ విధానాన్ని తాము ఒప్పుకోబోమన్నారు. పాత పింఛను విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పింఛనుదారులు చనిపోతే మట్టి ఖర్చుల సాయం అందడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్లు తదితర ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు.
ఐదు విడతల డీఏ బకాయిలు చెల్లించడం లేదని, జీపీఎఫ్లో పొదుపు చేసుకున్న డబ్బుకు సంబంధించి రుణాలు, పార్ట్ ఫైనల్ విత్డ్రా వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయ ఉద్యోగులకు 2-10-2021 నుంచి టైం స్కేల్ వర్తింపజేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వారికి సైతం ఆరోగ్య కార్డులు ఇవ్వాలని కోరారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వచ్చే నెల ఏడో తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.రామకృష్ణారెడ్డి, నగర అధ్యక్షుడు ఎంసీ కాశన్న, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
24, 25 తేదీల్లో పాఠశాలలకు సెలవు
దీపావళి సందర్భంగా జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సోమ, మంగళవారాల్లో సెలవు ప్రకటించినట్లు డీసీఈబీ కార్యదర్శి హేమారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళికి ఈనెల 24న అధికారిక సెలవు దినం కాగా, ఉపాధ్యాయ సంఘాల వినతుల మేరకు 25న కాంపెన్సేటరీగా పరిగణించి సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ సెలవు దినం బదులుగా నవంబరు 12వ తేది రెండో శనివారం పాఠశాలలు పనిచేస్తాయని ఆ ప్రకటనలో తెలిపారు.మేనిఫెస్టోలో పాతపెన్షన్ విధానాన్ని తెస్తామని చెప్పండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీరని నష్టం చేస్తు న్న నేషనల్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని కొన సాగించాలని, ఈ డిమాండ్ ను రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టాలని స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్టియు) రాహుల్ గాంధీని కోరింది. ఈమేరకు తమ వినతిపత్రాన్ని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు ద్వారా రాహుల్గాం ధీకి పంపించారు. రాజస్థాన్, చత్తీసఘర్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వారి రాష్ట్రాల్లో ఎన్పిఎస్ను రద్దు చేసి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని ఆ వినతి పత్రం లో తెలిపింది.175 ఇంటర్ కాలేజీలపై వేటు
ఒకేసారి గుర్తింపు రద్దు చేసిన బోర్డుప్రమాణాలు, వసతులు మెరుగుపడనందునే
3 నెలల గడువివ్వాలని కోరినా ససేమిరా
వాటిలోని విద్యార్థులు ఇతర కాలేజీలకు
రాష్ట్రంలో ఒకేసారి 175 ప్రైవేటు ఇంటర్ కాలేజీల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసేసింది. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలో చేసిన తీర్మానానికి ఆమోదముద్ర పడింది. నిర్దేశిత ప్రమాణాలు లేవనే కారణంతో ఇప్పటికే ఆ కాలేజీలకు నోటీసులు జారీచేశారు. మరో 3నెలల సమయం ఇస్తే నిర్దేశించిన ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలు కోరాయి. కానీ ఇంటర్ బోర్డు సమయం ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయా కాలేజీల్లో ఉండే సుమారు 20వేల మంది విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేరాలని బోర్డు సూచించనుంది. ఇప్పటివరకూ ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలు, హాస్టళ్లు ఎలా ఉండాలో పేర్కొంటూ ప్రభుత్వం రూపొందించిన కొత్త రెగ్యులేషన్కు బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే, ఇంటర్ కాలేజీల గుర్తింపు, అఫిలియేషన్ల రెన్యువల్ లాంటి అంశాలను మాన్యువల్ నుంచి ఆన్లైన్లోకి మార్చారు. ఈ సాఫ్ట్వేర్ను మంత్రి బొత్స ప్రారంభించారు. ఇకపై అనుమతులన్నీ ఈ సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతాయి. అలాగే ఇంటర్ పరీక్షల విధానంలో ప్రశ్నపత్రాలను ఆన్లైన్ చేయాలని ఇంటర్ విద్యామండలి చేసిన ప్రతిపాదనకు తర్వాతి బోర్డు సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది.
రెండో విడత డిగ్రీ అడ్మిషన్లకు షెడ్యూలు: రెండోవిడత డిగ్రీ అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి షెడ్యూలు విడుదల చేసింది. శుక్రవారం నుంచి 24 వరకు ఆన్లైన్లో రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని, 25నుంచి 27వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 28 నుంచి 31 తేదీల మధ్య వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, 3న సీట్లు కేటాయిస్తారని వివరించింది.
రెండో విడత డిగ్రీ అడ్మిషన్లకు షెడ్యూలు: రెండోవిడత డిగ్రీ అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి షెడ్యూలు విడుదల చేసింది. శుక్రవారం నుంచి 24 వరకు ఆన్లైన్లో రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని, 25నుంచి 27వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 28 నుంచి 31 తేదీల మధ్య వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, 3న సీట్లు కేటాయిస్తారని వివరించింది.
వడివడిగా .. బడి దిశగా .. పిల్లలను బడి బాట పట్టిస్తున్న సర్కారు
ఈ సంవత్సరం ఇప్పటికే 1.43 లక్షల డ్రాపవుట్స్ తిరిగి బడికి
ఇంటింటి సర్వేలో బడి వయస్సు పిల్లల గుర్తింపు
ఆర్టీసీ ఉద్యోగులకు AAS వర్తింపు ...... ఉత్తర్వులు జారీ
ఇతర ప్రభుత్వ శాఖలలో మాదిరిగానే ఆర్టీసీ ఉద్యోగలకు కూడా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలు చేస్తూ ఎండి ఉత్తర్వులు జారీ చేశారు
బీఎస్సీ, పోస్టు బీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్ ఫీజులు ఖరారు
రాష్ట్ర ప్రభుత్వం పోస్టు బీఎస్సీ నర్సింగ్, పోస్టు బీఎస్సీ నర్సింగ్, ఎమెస్సీ నర్సింగ్ ఫీజులను ఖరారు చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఏపీహెచ్ఈఆర్ఎంసీ సూచనల మేరకు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు ఫీజులు ఖరారు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. బీఎస్సీ నర్సింగ్లో ఏ కేటగిరి సీటుకు రూ.18000, బీ కేటగిరి సీటుకు రూ.80,000 ఫీజు ఖరారు చేశారు. ఎమ్మెస్సీ నర్సింగ్లో ఏ కేటగిరి సీటుకు రూ.83,000, బీ కేటగిరి సీటుకు రూ.1,49,000 ఫీజు నిర్ణయించారు. పోస్టు బీఎస్సీ నర్సింగ్లో ఏ కేటగిరి సీటుకు రూ.18,000, బీ కేటగిరికి రూ.80000 ఫీజును ప్రభుత్వం నిర్ధారించింది.సాఫ్ట్వేర్ కొలువుల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల సత్తా
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ నుండి 23 మంది ఎంపిక
నెలకు 1.10 లక్షల గరిష్ట స్టయిఫేండ్
నేటి నుండి ట్రైల్ రన్ తో ఫ్యామిలీ డాక్టర్
పల్లె ప్రజలకు ఇంటి వద్దే వైద్యం
మధ్యాహ్నం వరకు ఒపి .. ఆ తరువాత ఇళ్ల సందర్శన