టీచర్ల బదిలీలు మళ్లీ వాయిదా?
ఇప్పటికే అనేకసార్లు మారిన తేదీలుతాజాగా తెరపైకి సంక్రాంతి గడువు
అప్పుడు కూడా కష్టమేనని అనుమానాలు
ఈ విద్యా సంవత్సరానికి ఇక లేనట్టేనా?
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మళ్లీ వాయిదా పడినట్లు తెలిసింది. గురు వారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను పీఆర్టీయూ నేతలు కలవగా రెండుమూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని, లేని పక్షంలో సంక్రాంతి నాటికైనా చేస్తామని చెప్పారు. అయితే ఈ విద్యా సంవత్సరానికి మొత్తంగా ఉపాధ్యాయ బదిలీలను వాయిదా వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. సంక్రాంతి అంటే దాదాపుగా విద్యా సంవత్సరం చివరికి వస్తుంది. ఇప్పుడు. బదిలీలు అంటేనే బోధనపై ప్రభావం పడుతుందని భావి స్తుండగా, సంక్రాంతికి అంటే అది మరింత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో బదిలీలు చేసి పాఠం శాల విద్యను గందరగోళం చేసే సాహసం ప్రభుత్వం చేయక పోవచ్చు. అందువల్ల మొత్తానికి ఈ ఏడాది బదిలీలు జరగక పోవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే సీఎంతో మాట్లాడి రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం వెల్లడిస్తా. మని మంత్రి బొత్స తెలపడంతో బదిలీలు ఉండొచ్చేమోననే ఆశాభావంతోనే ఉపాధ్యాయ వర్గాలు ఉన్నాయి. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ వెంటనే చేపట్టాలని పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి కరుణానిధి మూర్తి, నేతలు గురువారం విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి విజ్ఞప్తి చేశారు.
10+2 ఫార్మాట్కు సీబీఎస్ఈ ముగింపు! కొత్తగా 5+3+3+4 విధానం
న్యూఢిల్లీ, నవంబరు 19: జాతీయ విద్యా విధానంలో సిఫారసులకు అనుగుణంగా సీబీఎస్ఈ కీలక మార్పులు చేయనుంది. ప్రస్తుతమున్న 10+2 ఫార్మాట్కు ముగింపు పలికి, దాని స్థానంలో 5+3+3+4 విధానాన్ని తీసుకురా నుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫార్మాట్ను ప్రకటించనున్నట్టు సీబీఎస్ఈ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్న పాఠశాలలు కొత్త విధానం లోకి మళ్లేందుకు అవసరమైన మార్పులు చేసుకోవాలని, దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది. స్కూల్, టీచర్, స్టూడెంట్ రిజిస్ట్రీలను ప్రారంభించ నున్నట్టు సీబీఎస్ఈ చైర్పర్సన్ నిధి చిబ్బర్ తెలిపారు. పిల్లల విద్య నాలుగు దశల్లో ఉండాలని జాతీయ విద్యా విధానం 2020 పేర్కొంది. ప్రారంభ దశ ఐదేళ్లు, తర్వాతి రెండు దశలు మూడేళ్ల చొప్పున, నాలుగోదైన మాధ్యమిక దశ నాలుగేళ్లు ఉండాలని సిఫారసు చేసింది. ఈ విభజన పిల్లల్లో మేధావికాసానికి అనుగుణంగా సూచించినట్టు తెలి పింది. ఈ మేరకు కొత్త వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానానికి సీబీఎస్ఈ శ్రీకారం చుట్టనుంది.AP లో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలు - 17 సంస్థలతో ప్రభుత్వ ఒప్పందం
RBK లలో సున్నా వడ్డీ రుణాల అర్హుల జాబితాలు
సున్నా వడ్డీ రుణాల నిధులు విడుదల 29నచైనా లో కరోనా కల్లోలం - 25 వేల కేసులు - బీజింగ్ లో లాక్ డౌన్
ట్రాన్స్ కొ ఉద్యోగుల్లో బయోమెట్రిక్ టెన్షన్
క్షత్ర స్థాయి ఇంజనీర్ లకు ఎలా వర్తింపచేస్తారనే ఆందోళన
స్వచ్చంద పదవీ విరమణ బాటలో నిపుణులైన సిబ్బంది
3 సార్లు పిలిచినా భర్తీకాని IIIT సీట్లు
ట్రిపుల్స్ఐటీల చరిత్రలో ఇదే తొలిసారి
నూజివీడు, న్యూస్ టుడే: జులైలో ఒకటి, రెండు కౌన్సె లింగుల్లోనే సీట్లన్నీ నిండిపోయే రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్జీయూకేటీ) ట్రిపుల్ ఐటీల్లో.. ఈ ఏడాది నవంబరు వచ్చినా, 3 కౌన్సెలింగులు నిర్వ హించినా ఇంకా 119 సీట్లు మిగిలిపోయాయి. ఆర్జీయూకేటీ చరిత్రలో ఈ పరిస్థితి రావడం ఇదే తొలిసారి. ఆర్జీయూ కేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కళాశాలలున్నాయి. ఈ నాలుగిం టికీ నాలుగోసారి కౌన్సెలింగ్ నిర్వహించినా సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రవేశాలకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలనూ పరిగణన లోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో అవి రావ డానికి ఆలస్యమైంది. దీనికితోడు సంబంధిత అధికారులు కమిటీ 1:1 నిష్పత్తిలో విద్యార్థులను కౌన్సెలింగ్కు పిలవాలని నిర్ణయించింది. ఫలితంగా తీవ్ర జాప్యం జరిగింది. ఆల స్యాన్ని గ్రహించిన విద్యార్థులు ప్రైవేటు బాటపట్టారు. అందుకే మూడో విడత కౌన్సెలింగ్ చేపట్టినా సీట్లు భర్తీ కాలేదు. ప్రస్తుతం మరో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తే... ఇప్పటికే ఫీజులు కట్టి ప్రైవేటు కళాశాలల్లో చేరిన విద్యా ర్థులు తిరిగి వస్తారనే నమ్మకం లేదు. గతంలో పదో తర గతి ఫలితాలు వెలువడగానే మార్కుల జాబితా ఆర్జీయూ కేటీకి చేరేది. అనంతరం ప్రతిభ ఆధారంగా 1:3 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను కౌన్సెలింగ్కు పిలిచేవారు. చాలావరకు మొదటి విడత కౌన్సెలింగ్లోనే చేరిపోయేవారు. కొన్ని మిగిలితే రెండో విడతలో సీట్లన్నీ భర్తీ అయ్యేవి.
రిజిస్ట్రేషన్ లకు ఆధార్ తప్పనిసరి కాదు
రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ
ముగిసిన తుది దశ కౌన్సెలింగ్
కోవిడ్ నుంచి కోలుకున్న వారికి మూర్ఛ ముప్పు
డిగ్రీలో 41 శాతమే ప్రవేశాలు
మూడు కోర్సుల్లో ఒక్కరూ చేరలేదుముగిసిన తుది దశ కౌన్సెలింగ్
విద్యార్ధులు 24 వ తేదీ సాయంత్రం 4 గంటల్లో చేరాలి
వై ఎస్ ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్
మంగళగిరి ఏం ఐ జి జగనన్న టౌనషిప్ లో 267 ప్లాట్ ల ఈ లాటరీ
డిసెంబర్ 31 వరకు ధరఖాస్తు గడువు పెంపుమధ్యాహ్న భోజన పథకం అమలుపై విజిలెన్స్ '
రాష్ట్రంలో 54 పాఠశాలల్లో క్షేత్రస్థాయి తనిఖీలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం (జగనన్న గోరుముద్ద) అమలు తీరుపై విజిలెన్స్ ఎన్ఫో ర్సెమెంట్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రాష్ట్రంలో 54 పాఠశాలల్లో విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేశాయి. చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును మండల విద్యాశాఖ అధికారి (ఎంఈ వో), జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)లు క్షేత్రస్థాయిలో పరిశీలించడంలేదని గుర్తించా రు. కొన్ని చోట్ల సరుకుల్లో, నిల్వల్లో తేడాలున్నట్లు పసిగట్టారు. వీటన్నింటినీ ప్రభుత్వానికి నివేదించనున్నారు.