Type Here to Get Search Results !

Telugu Educational Employees News 23rd Oct 2022

ఆన్లైన్ హాజరు ఆలస్యంపై ఉపాధ్యాయులకు నోటీసులు

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులపై ఆన్లైన్ హాజరు పేరుతో ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. హాజరు నమోదుకు 10నిమిషాలు అదనపు సమయం(గ్రేస్ పీరియడ్) ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. ఆలస్యంగా ఆన్లైన్ హాజరు నమోదు చేశారంటూ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారులు సంజాయిషీ నోటీసులు జారీ చేస్తున్నారు. ఉపాధ్యా యులు తమ సెల్ఫోన్లలోనే ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలని అధికారులు సూచించారు. దీనిపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరిపారు. నిర్ణీత సమయం తర్వాత 10 నిమిషాలు అదనపు సమయం ఇస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయులు ఉదయం 9గంటలలోపు హాజరు నమోదు చేయాలని సూచించారు. మూడు సార్లు ఆలస్యంగా వస్తే సగం రోజు సెలవు పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ, క్షేత్రస్థాయిలో జిల్లా విద్యాధికారులు మాత్రం నిమిషం ఆలస్యంగా వచ్చినా సంజాయిషీ నోటీసులు జారీ చేస్తున్నారు. పల్నాడు జిల్లాలోని అచ్చంపేట ఉపాధ్యాయులు ఉదయం 9:01 తర్వాత హాజరు నమోదు చేశారని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మూడు సార్లు ఆలస్యంగా వస్తే సగం రోజు సెలవు పెట్టాలనే నిబంధన ఉన్నా నోటీసులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.


'ఫేషియల్' వివాదం

అఖిల భారత సర్వీసు అధికారుల అసంతృప్తి
అమరావతి అధికారులకు, ఉద్యోగులకు అమలు చేస్తున్న ఫేషియల్ హాజర్ (ముఖ గుర్తింపు) విధానంపై మరో వివాదం తలెత్తుతోంది. తాజాగా అఖిల భారత సర్వీసు అధికారులు ఈ విధానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాము ఈ తరహా హాజరును ఎలా నమోదుచేస్తామని వారు ప్రశ్నిస్తుండగా, చేసి తీరాలంటూ. ప్రభుత్వం వరుసగా సర్క్యులర్లు జారీ చేస్తోంది. మొదట్లో సచివాలయంలోని ఉద్యోగులకు మాత్రమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆ తరువాత కార్యదర్శులకు, శాఖాధిపతులు కూడా దీనినే పాటించాలని ఆదేశించింది. అయితే చాలామంది ఐఏఎస్ లు, ఐపిఎస్ లు, ఇతర కేంద్ర సర్వీసు అధికారులు యాప్ను డౌన్లోడ్ చేయకుండా, సాధారణ హాజరు విధానాన్ని మాత్రమే పాటిస్తున్నారు. శాఖాధిపతులైతే.. తాము ఎక్కువగా క్షేత్ర స్థాయి పర్యటనలకు అధికారికంగా వెళు ంటామని, ఈ నేపథ్యంలో ఫేషియల్ హాజరు సాధ్యం కాదని అంటున్నారు. దీంతో సాధారణ పరిపాలన శాఖ కొత్త సర్క్యులర్ జారీ చేసింది. ప్రతి రోజూ నాలుగు గంటల కల్లా హాజరు నివేదికలు ఇవ్వాలని నిర్దేశించింది. దీనికోసం ఒక నమూనాను కూడా విడుదల చేసింది. ఒక శాఖలో ఎంతమంది అఖిల భారత సర్వీసు స్థాయి అధికారులు పనిచేస్తున్నారు. వారిలో నిర్ధిష్ట సమయానికి వచ్చిన వారు, ఆలస్యంగా వచ్చిన వారు, పర్యటనలో ఉన్నట్లు నమోదు చేసిన వారు, సెలవులో ఉన్న వారు, ఏ కారణం చూపకుండా గైర్హాజరైన వారు అన్న వివరాలు చెప్పాలని సాధారణ పరిపాలన శాఖ నిర్దేశించింది. వారి సెలవుల్లో ఎన్ని రికార్డయ్యాయన్నది కూడా నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

నీట్ పీజీ మెడికల్ కటాఫ్ మార్కుల తగ్గింపు

జాతీయ వైద్య మండలి తాజాగా నీట్ పీజీ మెడికల్ - 2022 ప్రవేశా లకు సంబంధించి కటాఫ్ మార్కులను తగ్గిం చిన నేపథ్యంలో విజయవాడలోని డాక్టర్ ఎన్టీ ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ మెడికల్ డిగ్రీ/ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. జనరల్ కేటగిరీ (అన్ రిజర్వుడు) విభాగంలో గతంలో ఉన్న 275 కటాఫ్ మార్కులను తాజాగా 201కి, ఎస్సీ/ ఎస్టీ, బీసీ కేటగిరీలో 245 నుంచి 169కి, అన్ రిజర్వుడు- పీడబ్లూ డీ విభాగంలో 260 నుంచి 186కి కుదించి నట్లు చెప్పారు. ఈ మార్కుల ప్రాతిపదికన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వాలని కోరారు. సాంకేతిక సమస్యలుంటే 74165 63063కి, మార్గనిర్దేశకాల్లో సందేహా లుంటే 89787 80501 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

25 నుంచి గ్రామాల్లో మొబైల్ ఆధార్ క్యాంపులు

నవంబర్ రెండో వారంలో మరో విడత
ఇక నుంచి ప్రతి నెలా ఐదారు రోజులు నిర్వహణ
రాష్ట్రంలో కోటి మంది 'ఆధార్'లో పాత డేటానే
 రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 25 నుంచి 31 వరకు గ్రామ సచివాల యాల ఆధ్వర్యంలో మొబైల్ ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. నవంబరు రెండో వారంలో కూడా మరోవిడత మొబైల్ ఆధార్ క్యాంపుల నిర్వహణకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాట్లుచేస్తోంది. రాష్ట్రంలో దాదాపు కోటి మందికి సంబంధించిన ఆధార్ కార్డుల్లో ఫొటో, బయో మెట్రిక్, ఐరిస్ తదితర సమాచారం పాత డేటాతో కొనసాగుతున్నాయని ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ గుర్తించింది. వీరిదంతా 10-12 ఏళ్ల క్రితం నమోదుచేసుకున్న సమాచారమే ఇప్పటికీ కొనసాగుతోందని.. ఎలాంటి మార్పు లూ చేర్పులు జరగలేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో.. బ్యాంకులు, ఇతర ఆర్థిక లావాదేవీల సందర్భంగా లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా కనీసం ప్రతీ పదేళ్లకు ఒకసారైనా ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవాలంటూ యూఐడీఏఐ ఇటీవల సూచించింది.
1,950 సచివాలయాల్లో ఆధార్ సేవలు
దీంతో ఈ ఏడాది డిసెంబరు నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా రాష్ట్రంలో వీలైనంత ఎక్కువమంది ఆధార్ వివరాలను అప్డేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 1,950 గ్రామ సచివాల యాల్లో ఆధార్ సేవలను అందుబాటులో ఉంచారు. వీటి ద్వారా ప్రతినెలా ఐదు నుంచి వారం రోజులపాటు మొబైల్ క్యాంపుల నిర్వహణకు గ్రామ, వార్డు సచి వాలయ శాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. ఈ సచివాలయాల పరిధిలో రోజువారీగా కొన్ని పాఠశాలలను ఎంపికచేసి అక్కడ చదివే పిల్లలతోపాటు స్థానికుల ఆధార్ వివరాలను రోజుకు 200 మంది చొప్పున అప్డేట్ చేయాలని నిర్ణయించారు. వలంటీర్ల ద్వారా ఆధార్ క్యాంపుల సమాచారం తెలియజేస్తారు.

మహిళా హాస్టళ్లు మరిన్ని నిర్మించాలి

ప్రవేశాల సమయంలోనే సమగ్ర వివరాలతో హ్యాండ్బుక్ ఇవ్వాలి
తగినంత మంది భద్రతా సిబ్బందిని నియమించాలి
యూజీసీ కమిటీ మార్గదర్శకాలు విడుదల
విద్యార్థినుల కోసం మరిన్ని హాస్టళ్లు నిర్మించాలని యూజీసీ కమిటీ దేశంలోని ఉన్నత విద్యాసంస్థలను ఆదేశించింది. వర్సిటీలు, కళాశాలల్లో అమ్మాయిల భద్రతపై నియ మించిన కమిటీ ఆయా విద్యా సంస్థలు తీసుకోవా ల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఆడ పిల్లల హాస్టళ్లను ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా నిర్మించాలని, భోజనశాల, క్యాంటీన్, శుభ్రమైన శౌచా లయాలు, వాషింగ్ మెషిన్లతో కూడిన దుస్తులు ఉతుక్కునే గదులు, వై ఫై సౌకర్యం, ఇండోర్ గేమ్స్, రీడింగ్ రూంలు అందులో ఉండాలని పేర్కొంది. విద్యార్థులు ప్రవేశాలు పొందే సమయంలోనే హెల్ప్ లైన్ నంబర్లు, స్టూడెంట్ కౌన్సెలర్లు, యాంటీ ర్యాగింగ్ సెల్, అత్యవసర వైద్యం, ఆరోగ్య కేంద్రం, క్యాంటీన్ తదితర పూర్తి వివరాలతో హ్యాండ్ బుక్ ముద్రించి అందించాలని, అమ్మాయిలకు అనుకూల మైన, సురక్షితమైన ప్రాంగణాలుగా తీరిదిద్దాలని కోరింది. విశ్వసనీయత ఉన్న సెక్యూరిటీ సంస్థల నుంచి తగినంత మంది మహిళా భద్రతా సిబ్బం దీని నియమించాలని సూచించింది. మొత్తం 28 రకాల చర్యలు చేపట్టాలని పేర్కొంది.

గిరిజన విద్యారంగ సమస్యలు పరిష్కరించాల్సిందే : యుటిఎఫ్‌

అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొనసాగిన జీపుజాతా
గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన జీపుజాతా శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో సాగింది. ఎటపాక మండలంలోని కెఎన్‌.పురం, నల్లకుంట ఆశ్రమ పాఠశాలలు, ఎటపాక కెజిబివి, నెల్లిపాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను యుటిఎఫ్‌ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎటపాకలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా పని చేస్తున్న తమకు ఏడాదిగా జీతాలు రావడం లేదని ఏడుగురు సిబ్బంది ఆయనకు వినతిపత్రం అందజేశారు. నెల్లిపాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేవని, ప్రాక్టికల్స్‌ కోసం ల్యాబ్‌ లేదని, ప్రిన్సిపల్‌ మినహా సిబ్బంది అంతా అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలోనే పని చేస్తున్నారని, విద్యార్థులకు పుస్తకాలు సైతం ఇవ్వడం లేదని సిపిఎం నాయకులు ఐ.వెంకటేశ్వరరావు, డేగల మాధవరావు వినతిపత్రం ద్వారా యుటిఎఫ్‌ బృందానికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జీపుజాతా బృందంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ వర్మ, జిల్లా అధ్యక్షులు విల్సన్‌ బాబు, నాయకులు పాల్గొన్నారు.

ఏడాదిన్నర లో 10 లక్షల ఉద్యోగాలు 

కేంద్రం రోజ్ గార్  మేళ ప్రారంభం 
దేశవ్యాప్తంగా చేపడుతున్న రోజ్‌గార్‌ మేళా ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కోసం చేపట్టిన చర్యల్లో ఓ కీలక మైలు రాయి అని ప్రధాని నరేంద్ర మోడీ అనాురు. రోజ్‌గార్‌ మేళాను శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 75 వేల మందికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నియామక పత్రాలు అందజేశారు.

చదవుకు చెదలు -రాష్ట్రంలో గాడి తప్పిన విద్యా వ్యవస్థ

ఒకటో తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకూ అంతే!
 పాఠశాల విద్యతో ప్రయోగాలు'
ప్రైవేటు బాటలో విద్యార్థులు 
టెన్, ఇంటర్ లో ఘోరమైన ఫలితాలు 
చుక్కలు చూపించిన డిగ్రీ కౌన్సెలింగ్ 
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాష్యం ఇతర రాష్ట్రాలకు విద్యార్థుల వలస
రాష్ట్రంలో పరిస్థితిపై విద్యారంగ నిపుణుల ఆందోళన



వెబ్సైట్ లో ఎంపికైన అభ్యర్ధుల జాబితా 

ఆర్టీసీ లో ఐటిఐ ఎప్రింటీస్ కు ఎంపికైన అభ్యర్ధుల జాబితా సంస్థ వెబ్సైట్ లో పెట్టినట్టు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి తెలిపారు 


Tags