జీవో 550పై వ్యాజ్యాల్లో వాదనలు పూర్తి - తీర్పును వాయిదా వేసిన హైకోర్టు
- ఎంబిబిఎస్ తరగతులెన్నడో!
ప్రతిభతో జనరల్ కేటగరీలో మెడికల్ సీటు పొందిన రిజర్వుడు మెరిటోరియస్ క్యాండిడేట్ (ఆర్ఎంసీ) ఆ సీటును ఖాళీచేస్తే దాన్ని ఎవరితో భర్తీ చేయాలనే అంశంపై స్పష్టత రాలేదని హైకోర్టు అభిప్రాయపడింది. వైద్య విద్య సీట్లను రోస్టర్ విధానంలో భర్తీ చేయడం సాధ్యం కాదని, అది కేవలం ఉద్యోగ వర్గాలకే వర్తిస్తుందని తెలిపింది. మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి జీవో 550ని అమలుకు అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన వేర్వేరు పిటిషన్లలో మంగళవారం వాదనలు ముగిసాయి. వాదనలు విన్న ధర్మాసనం... తమ సంక్షిప్త వాదనలను ఒక పేజీకి మించకుండా రాతపూర్వకంగా ఇవ్వాలని న్యాయవాదులకు సూ చించింది. ఈ వ్యాజ్యాల్లో తీర్పు వాయుదా వేసింది. హైకోర్టు సీజే జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
రిజర్వుడు అభ్యర్థులు ప్రతిభతో జనరల్ కోటాలో సీట్లు పొందాక దాన్ని వదులుకుని మరో కాలేజీలో చేరితే... ఆ సీటును అదే సామాజిక వర్గానికి చెందిన వారితో భర్తీ చేయాలని ఉమ్మడి ఏపీలో 2001లో జీవో 550 జారీచేశారు. ఈ జీవోలోని ఒక భాగాన్ని హై కోర్టు నిలుపుదల చేయడంతో ఈ సీట్లను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. దీంతో తాము సీట్లు కోల్పోతున్నామం టూ రిజర్వుడు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. జీవోను వ్యతిరేకిస్తూ మరికొందరు కోర్టుకు వెళ్లారు. జనరల్ కేటగిరి (ఓసీ) అభ్యర్థుల తరఫున న్యాయవాది గంటా రామారావు వాదించారు. జనరల్ కేటగిరిలో సీటు పొందిన ఆర్ఎంసీ అభ్యర్థి ఆ సీటు వదులుకుని పొరుగు రాష్ర్టాల్లో చేరినప్పటికీ... అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులతో భర్తీచేయడం సరికాదన్నారు. ఇలా చేస్తే రిజర్వేషన్ 50శాతానికి మించిపోతుందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15(1)లను ఉల్లంఘించడమేన్నారు.
ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ వాదిస్తూ... ఖాళీ అయి న సీట్లను జీవో 550 అనుసరించి అదే సామాజిక వర్గానికి చెందిన వారితో భర్తీ చేస్తే... కోటా శాతం 50కి మించుతుందని చెబుతున్నారేగాని, ఆధారాలు చూపడం లేదన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు అనుగుణంగానే జీవో 550 జారీచేశారన్నారు. జీవోకు అనుకూలంగా దాఖలైన వ్యాజ్యాల్లో సీనియర్ న్యాయవాదులు ఎ. సత్యప్రసాద్, కేఈ కృష్ణమూర్తి జె. సుధీర్లు వాదించారు. జనరల్ కేటగిరిలో సీటు పొందిన ఆర్ఎంసీ అభ్యర్థి మరొక కాలేజీలో రిజర్వు కోటాలో చేరిన పక్షంలో ఆ సీటును అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ప్రతిభ ఆధారంగా కేటాయించాలన్నారు.
రిజర్వుడు అభ్యర్థులు ప్రతిభతో జనరల్ కోటాలో సీట్లు పొందాక దాన్ని వదులుకుని మరో కాలేజీలో చేరితే... ఆ సీటును అదే సామాజిక వర్గానికి చెందిన వారితో భర్తీ చేయాలని ఉమ్మడి ఏపీలో 2001లో జీవో 550 జారీచేశారు. ఈ జీవోలోని ఒక భాగాన్ని హై కోర్టు నిలుపుదల చేయడంతో ఈ సీట్లను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. దీంతో తాము సీట్లు కోల్పోతున్నామం టూ రిజర్వుడు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. జీవోను వ్యతిరేకిస్తూ మరికొందరు కోర్టుకు వెళ్లారు. జనరల్ కేటగిరి (ఓసీ) అభ్యర్థుల తరఫున న్యాయవాది గంటా రామారావు వాదించారు. జనరల్ కేటగిరిలో సీటు పొందిన ఆర్ఎంసీ అభ్యర్థి ఆ సీటు వదులుకుని పొరుగు రాష్ర్టాల్లో చేరినప్పటికీ... అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులతో భర్తీచేయడం సరికాదన్నారు. ఇలా చేస్తే రిజర్వేషన్ 50శాతానికి మించిపోతుందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15(1)లను ఉల్లంఘించడమేన్నారు.
ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ వాదిస్తూ... ఖాళీ అయి న సీట్లను జీవో 550 అనుసరించి అదే సామాజిక వర్గానికి చెందిన వారితో భర్తీ చేస్తే... కోటా శాతం 50కి మించుతుందని చెబుతున్నారేగాని, ఆధారాలు చూపడం లేదన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు అనుగుణంగానే జీవో 550 జారీచేశారన్నారు. జీవోకు అనుకూలంగా దాఖలైన వ్యాజ్యాల్లో సీనియర్ న్యాయవాదులు ఎ. సత్యప్రసాద్, కేఈ కృష్ణమూర్తి జె. సుధీర్లు వాదించారు. జనరల్ కేటగిరిలో సీటు పొందిన ఆర్ఎంసీ అభ్యర్థి మరొక కాలేజీలో రిజర్వు కోటాలో చేరిన పక్షంలో ఆ సీటును అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ప్రతిభ ఆధారంగా కేటాయించాలన్నారు.