1న మూడు రాజధానులపై సుప్రీం విచారణ
మూడు రాజధానులపై దాఖలైన పిటిషన్లపై వచ్చే నెల ఒకటో తేదీన విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని కొట్టివేస్తూ, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ ఈ ఏడాది మార్చి 3న రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలేదని, అమలు చేయించేలా ఆదేశాలివ్వాలంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి పిటిషన్లను దాఖలు చేసింది. అన్ని పిటిషన్లను ఒకేరోజు విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే, రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ను నవంబరు ఒకటిన విచారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా తాము దాఖలు చేసిన పిటిషన్కు కూడా అత్యవసరంగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు లేఖ రాయడంతో, దానినీ అదే రోజు విచారించడానికి అంగీకరించింది.సీపీఎస్ రద్దుకు పంజాబ్ కేబినెట్ ఆమోదం
వారంలో రద్దు చేస్తామన్న ఏపీలో జీపీఎస్ పేరిట కొత్త నాటకంసీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్
కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్) రద్దుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ససేమిరా అంటుండగా... మరోవైపు సీపీఎస్ ను రద్దు చేస్తున్న రాష్ట్రాల జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలు సీపీఎస్ ను రద్దు చేయగా.. పాత పింఛను విధానాన్ని అమలు చేసేందుకు తాజాగా పంజాబ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎలాంటి హామీలు ఇవ్వని రాష్ట్రాలు సీపీ ఎస్ ను రద్దు చేస్తుంటే.. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం జగన్ రద్దు చేయట్లేదని సీపీఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు అప్పలరాజు, పార్థసారథి మాట్లాడుతూ.. 'అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు గ్యారంటీ పెన్షన్ అంటూ కొత్త నాటకానికి తెరతీశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయ త్నిస్తే ఉద్యోగులపై క్రిమినల్, బైండోవర్ కేసులు పెట్టారు. ఈ కేసులను ఎత్తివేస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సమాజంలో విలువలు, విశ్వసనీయతను తీసుకొస్తామన్నారు. ఆయన ఇచ్చిన హామీలకే విలువ ఇవ్వకపోతే విశ్వసనీ యత ఎలా వస్తుంది? సీపీఎస్ పై ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ గంద రగోళం సృష్టిస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసిన రాష్ట్రాలకు లేని అడ్డంకులు ఏపీకి ఎందుకు వస్తు న్నాయి? రెండు రోజుల క్రితం రాజస్థాన్ ప్రభుత్వం పదవీవిరమణ పొందిన సీపీఎస్ ఉద్యో గులకు పింఛను ఇస్తూ చర్యలు తీసుకుంది' అని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పంజాబ్లో పాత పింఛను విధానం పునరుద్ధరణ
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మంత్రిమం డలి సమావేశంలో సూత్రపాయ నిర్ణయం తీసుకు న్నట్లు శుక్రవారం రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన నియమనిబంధనలను ఖరారు చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్ ప్రభుత్వం అందిస్తున్న దీపావళి కానుకగా దీన్ని సీఎం పేర్కొ న్నారు. 2004లో నిలిపివేసిన పింఛను పథకాన్ని పునరుద్ధరించాలనేది పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్. ఎన్నికల ముందు ఆ మేరకు ఆప్ హామీ కూడా ఇచ్చింది. "ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని కేజీవాల్ అంటారు. అందులో భాగం గానే హామీలను నెరవేరుస్తున్నాం" అని సీఎం భగవంత్ తెలిపారు. దీంతో పాటు.. ఉద్యోగులకు, పింఛనుదారులకు 6% కరవు భత్యం (డీఏ) కూడా ప్రకటించారు. హిమాచల్, గుజరాత్ ఎన్ని కల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆపనకు.. ప్రభుత్వ నిర్ణయం కలిసిరానుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. తమకు అధికారమిస్తే పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తామని ఆ రాష్ట్రా ల్లోని ప్రభుత్వ ఉద్యోగులకూ ఆప్ హామీ ఇచ్చింది.ఆరేళ్ల వరకు బొమ్మలతోనే బోధన
ఎన్సిఎప్ ని విడుదల చేసిన ధర్మేంద్ర ప్రదాన్మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసు గల పిల్లలకు పాఠ్యపుస్తకాలుండవు. బొమ్మల ఆధారంగానే బోధన ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వయసు గల పిల్లల కోసం 360 పేజీల నూతన జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ (ఎన్సీఎఫ్)ని విడుదల చేశారు. ప్రాథమిక దశకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రిని జనవరి 2023 నాటికి ఈ ఫ్రేమ్వర్క్ ఆధారంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సిఇఆరి) తయారు చేస్తుంది. ఎన్సిఎఫ్కి అనుగుణంగా నర్సరీ నుండి రెండో తరగతి మధ్య చదువుతున్న పిల్లల కోసం పాఠశాలలు, ప్రీ-స్కూల్స్, అంగన్వాడీలు అనుసరించే అన్ని బోధనా విధానాలు ఉంటాయి. పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు, భాషా విద్య, అక్షరాస్యత, గృహ ఆధారిత అభ్యాసం, బోధనా శైలులు, మూల్యాంకన పద్ధతులు ఉంటాయి. ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయసు గల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు డిజిటల్, ఆడియో విజువల్ మెటీరియల్ రిఫరెన్స్లను సిఫార్సు చేసింది. పాఠ్యపుస్తకాల్లో ప్రాంతీయ వైవిధ్యాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఫ్రేమ్వర్క్ పేర్కొంది. తరగతి గదిలో అన్ని భాషలను తప్పనిసరిగా స్వాగతించాలని పేర్కొంటూనే, ప్రాథమిక దశలో పిల్లలు తమ "హోమ్ లాంగ్వేజెస్" (మాతభాషలలో తమ భావాలను వ్యక్తీకరించడానికి, పరస్పరం చర్చించుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రోత్సహించాలని ఎన్సిఎఫ్ పేర్కొంది. భౌతిక వికాసం (శారీరక్ వికాస్), జీవిత శక్తి అభివృద్ధి (ప్రాణిక్ వికాస్, భావోద్వేగ, మానసిక వికాసం (మానసిక్ వికాస్), మేధో వికాసం (బౌద్ధిక్ వికాస్), ఆధ్యాత్మిక వికాసం (చైత్సిక్ వికాస్)తో కూడిన విద్య కోసం పంచకోశ వ్యవస్థను ప్రస్తావించింది. సావిత్రీబాయి పూలే, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి విద్యా మార్గదర్శకులను కూడా బోధనలో పేర్కొంది.
ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలి
నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్ నివేదిక స్పష్టీకరణప్రాథమిక విద్యాబోధన పిల్లల మాతృభాషలో లేదా, బాగా తెలిసిన భాషలో సాగడం ఉత్తమమని కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్ నివేదిక వెల్లడించింది. చిన్నారులు తమ మాతృభాషలోనే విషయాలను వేగంగా సంగ్రహించి లోతుగా అర్థం చేసుకోగలు గుతారు కాబట్టి ఈ విధానమే ఉత్తమమని తెలి పింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రెండింటిలోను ఇదే పద్ధతిని అనుసరించాలని పేర్కొంది. "పిల్లలు ప్రాథమిక విద్యాభ్యాసం మొదలు పెట్టినప్పుడు వారి మాతృభాష (ఎల్1)లో బోధన కొనసాగేలా చూడాలి. ఇందు కోసం సదరు భాషను బోధించడంతోపాటు వారి సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకోగ లిగిన స్థానిక టీచర్లను నియమించడం అత్యవ సరం. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన చేసే టీచర్లు పిల్లల మాతృభాషలో నిపుణులై ఉండాలి. చిన్నారులు విద్యాబోధనా ప్రక్రియలో తల్లిదండ్రులనూ భాగస్వాములను చేయాలి. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి, అభ్యాసానికి ఇది చాలా ముఖ్యం" అని ఈ నివేదిక పేర్కొంది.
ఏకరూప దుస్తుల కుట్టుకూలి పెంచుతున్నాం
మంత్రి బొత్స సత్యనారాయణజగనన్న విద్యాకానుక కింద ఇస్తున్న పుస్తకాలు బ్యాగుల్లో తొమ్మిది శాతం బాగాలేవని ప్రభుత్వ సర్వే లో తేలిందని, అందు వల్ల గుత్తేదారుకు బిల్లులు నిలిపివేశామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ పేర్కొన్నారు. విద్యార్థు లకు ఇచ్చే ఏకరూప దుస్తుల కుట్టు కూలిని పెంచుతున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం నాగళ్లవలసలో నిర్మించిన సచివా లయ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కిచిడి, పులి హోర బాగోలేదని విద్యార్థులు చెప్ప డంతో దీన్ని మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి నుంచి పింఛను కానుక పెంచుతున్నా మని తెలిపారు.
నాలుగేళ్లు డిగ్రీలో ఎప్పుడైనా చదువు ఆపేసి.. వెళ్లిపోవచ్చు
నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా నాలుగేళ్ల డిగ్రీలో విద్యార్థి ఎప్పుడైనా చదువు ఆపేసి, బయటకు వెళ్లి పోయే అవకాశాన్ని కల్పించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఉన్నత విద్యలో ప్రవేశాలను పెంచేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన తర్వాత చదువు ఆపేసి, వెళ్లిపోవాలను కుంటే విద్యార్థి వెళ్లిపోవచ్చు. ఏడాది చదివినందుకు కొన్ని క్రెడిట్లు ఇచ్చి సర్టిఫికెట్ ప్రధానం చేస్తారు. ఒకవేళ మళ్లీ వచ్చి డిగ్రీ చదువుకోవచ్చు. లేదంటే ఈ క్రెడిట్లను బదిలీ చేసుకొని, డిప్లొమా గాని, ఇతర కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. డిగ్రీ రెండో సంవత్సరం పూర్తయిన తర్వాత మానేస్తే డిప్లొమా ఇస్తారు. మూడేళ్ల తర్వాత వెళ్లిపోతే డిగ్రీ, ఆ తర్వాత ఆనర్స్ డిగ్రీ ప్రదానం చేస్తారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పాఠ్యప్రణాళి కలోనూ కొన్ని మార్పులు చేయనున్నారు. దీన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదుపీజీ సెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ను శనివారం నుంచి ప్రారంభిస్తున్నామని కన్వీనర్ నజీర్ అహ్మద్ తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ 22-29వ తేదీ వరకూ, ధ్రువపత్రాల పరిశీలన 22-30 వరకూ, ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన 26-28వరకూ, సీట్లు, కళాశాలల ఎంపి కకు వెబ్ ఐచ్ఛికాలు 30 నుంచి నవంబరు 3వ తేదీ వరకూ, ఐచ్ఛికాల మార్పు 3న, సీట్ల కేటాయింపు 5న, కళాశాలల్లో చేరికలు 7-10, తరగతులు 9వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.కిచిడీకి బదులు పప్పు పులుసు
- మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు: బొత్స
డీఏ ఎప్పటికో? ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల వెతలు
- 2018 నుంచి బకాయిలు
- ఏడు డీఏలపై నిర్లక్ష్య వైఖరి
- జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలు
2018 నుంచి నిలిచిన డీఏ బకాయిలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 2018 నుంచి బకాయిపడిన డీఏలకు చెందిన కోట్లాది రూపాయలు ఇప్పటికీ చెల్లించలేదు. ఆర్థికపరమైన ఏ అంశాన్ని పరిష్కరించకపోయినా ఉద్యోగులు ఓపికతో ఎదురు చూస్తున్నారు. సీఎం జగను, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఉద్యోగ సంఘాల నేతలు చాలా సార్లు వినతిపత్రాలు అందజేసినప్పటికీ స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వంతోపాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు డీఏతోపాటు దీపావళి కానుకగా అదనంగా బోనస్లూ ప్రకటించాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. తమిళనాడు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు కూడా దసరా, దీపావళి పండుగలకు కొత్త డీఏలు ఇవ్వడంతోపాటు ఉద్యోగులకు చెందిన నిలిచిన బకాయిలన్నీ చెల్లించాయి. 2018 జులై నుంచి డిసెంబరు వరకు రావాల్సిన ఏడు పాత డీఏ బకాయిలతోపాటు ఈ ఏడాది, 2022 జనవరి, జులై రెండు డీఏల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని చెల్లించాలంటూ అమరావతి జేఏసీ, ఎస్టీయూ తదితర సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బులు, వారికి రావాల్సిన ప్రయోజనాలను ఏళ్ల తరబడి ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
ఉపాధ్యాయ ప్రయోజనాలపై వివక్ష
పీఆర్సీ - 2020 అమలు సమయంలో 27 శాతం ఐఆర్ ఇస్తున్నప్పటికీ, ఫిక్సేషన్ 23 శాతానికే పరిమితం చేసి ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఆర్ధికంగా ప్రభుత్వం నష్టం చేకూర్చింది. హెచ్ఆర్ఎ స్లాబులను తగ్గించడంతో ఉపాధ్యాయ వర్గానికి తీవ్ర నిరాశ మిగిల్చింది. 2018 జులై నుంచి 2021 డిసెంబరు వరకు ఇచ్చిన ఏడు విడతల దీఏల బకాయిలను ఉద్యోగులకు చెల్లించలేదు. ఈ ఏడాది జనవరి డీఏ, జులై డీఏల చెల్లింపుపై ఇంతవరకూ ఉత్తర్వులు ఇవ్వలేవు. సరెండరు లీవ్, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ఏపీబీఎల్బ రుణాలు, పదవీ విరమణ తుది చెల్లింపుల విషయంలో తీవ్ర జాప్యం నెలకొంది. 2003-డీఎస్సీ ద్వారా ఎంపికై, 2004లో విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) వర్తింపజేస్తామని జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారితోపాటు డీఎస్సీ-2002 ద్వారా ఎంపికైన 400 మంది హిందీ పండిట్లకు సైతం పాత పెన్షన్ వర్తింపచేయాల్సి ఉంది. కరోనాతో మరణించిన ఉపాధ్యాయ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాన్ని చేపట్టలేదు. ఆర్థికంగా చాలా బాగున్నామని చెబుతున్న సీఎం, తక్షణమే ఉద్యోగుల ప్రయోజనాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ దీపావళికైనా నిలిచిన డీఏలను ప్రభుత్వం ప్రకటించాలని, లేకుంటే తమ హక్కుల సాధన కోసం ఉద్యమబాట పడతామని హెచ్చరిస్తున్నారు
జూనియర్ వైద్యుల వేతనాలు పెంపు
- 15 శాతం పెంచుతూ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు
- సమ్మె తాత్కాలికంగా వాయిదా: జూనియర్ వైద్యుల సంఘం